ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస
మచిలీపట్నం :
కృష్ణాజిల్లాలో ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇటీవల 10వ తరగతి, ఇంటర్ పరీక్షలలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అభినందిస్తూ సత్కరించారు.
10వ తరగతి
ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహము – తిరుమలశెట్టి సిరిచందన 575 మార్కులు, బండ్రెడ్డి అక్షయ 571 మార్కులు
ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహము – చిన్నం యదిద్య 565 మార్కులు
ఇంటర్మీడియట్
ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహము అవనిగడ్డ – బొల్లంకొండ దివ్య 971 మార్కులు
ఈ కార్యక్రమములో కృష్ణాజిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జి రమేష్, అవనిగడ్డ సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎమ్ డి షఫీఉల్లా, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, మచిలీపట్నం, ఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

