MachilipatnamLocal News
September 5, 2026
పామర్రు

జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో 187 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ

  • March 8, 2026
  • 1 min read
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో 187 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ
మొవ్వ, 8 మార్చి 2026, SSN:         
            జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో 187 మందికి   ఆదివారం సాయంత్రం  ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఫిబ్రవరి 28 న మొవ్వలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో సుమారు 370 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, కళ్ళజోళ్ళు సిఫారసు చేసిన 187 మందికి మొవ్వ శ్రీ మండవ జానకి రామయ్య, సులోచన క్షేత్రయ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో  కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. 
          సేవే పరమావధిగా జయప్రద ఫౌండేషన్ సేవలందిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జయప్రద ఫౌండేషన్ ఛైర్మన్, టి.డి.పి. పాలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ పొలిటికల్ సెక్రటరీ, మాజీ యం.యల్.సీ. , యన్.టి.ఆర్. లిటరేచర్ కమిటీ అధ్యక్షులు  తొండెపు దశరధ జనార్దన్,  పామర్రు శాసన సభ్యులు  వర్ల కుమార్ రాజా, ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్  లింగమనేని రామలింగేశ్వర రావు , జయప్రద ఫౌండేషన్ మెంటార్ శ్రీమతి చెరుకూరి చాముండేశ్వరి, మొవ్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోనేపూడి శివరామయ్య, బార్లపూడి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు తాతినేని పూర్ణచంద్రరావు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మండవ రత్నగిరి రావు, డాక్టర్లు శ్రీమతి నాదెళ్ల స్వాతి, డా గుత్తికొండ హర్ష, డా ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. 
        అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన 5 గురు మహిళలను అతిధులు ఘనంగా సత్కరించారు. సామాజిక సేవకు గాను శ్రీమతి మండవ బాల త్రిపుర సుందరి, సంగీత రంగంలో శ్రీమతి యేలేశ్వరపు రాధికా సుబ్రమణ్యం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి మేకా రాణి, మిద్దె తోటల పెంపకానికి గాను శ్రీమతి బొందలపాటి రాణి, మొవ్వ మాజీ మండల అధ్యక్షురాలు కిలారపు మంగమ్మ లను సత్కరించారు.
         మొవ్వ గ్రామస్తులు  మండవ కోటేశ్వర రావు, శ్రీ మండవ ఫణి కుమార్ వైద్య శిబిరం ఏర్పాటు, కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమానికి పూర్తి సహకారమందించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *