మచిలీపట్నం :
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు నగర ప్రజలు ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పిలుపునిచ్చారు .
శుక్రవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 40 మంది స్వచ్ఛ సైనికులు పదవ డివిజన్లో స్వచ్ఛాయుధాలు, చీపుళ్ళు పట్టుకుని వీధులు శుభ్రం చేశారు .నాయర్ బడ్డి సెంటర్లో జిల్లా రెవెన్యూ అధికారి బంగ్లాకు దగ్గరలో ఒక బ్లాక్ స్పాటును గుర్తించారు ఆ బ్లాక్ స్పాట్ లోని ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగించారు .అక్కడ ఒక మొక్క నాటేందుకు నిర్ణయం తీసుకున్నారు .మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కార్యదర్శి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బాగ్ , మానవతా సంస్థ ఉపాధ్యక్షుడు సన్ స్టార్ స్కూల్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి స్వామి, సన్ స్టార్ కళాశాల ప్రిన్సిపాల్ ఆదిత్య , మానవతా సంస్థ జిల్లా కో కన్వీనర్ ముదిగొండ శాస్త్రి , మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యుడు వి సుందరరాం, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏవి గోపాలరావు ,కోస్తా మురళీకృష్ణ, బొమ్మిడి శ్రీరాముల లతో పాటు సన్ స్టార్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
కలెక్టర్ బాలాజీ పిలుపు మేరకు మచిలీపట్నాన్ని సుందర మచిలీపట్నం గా తీర్చిదిద్దుతున్నామన్నారు ఇందుకు నగర ప్రజలు సహకరించాలన్నారు .
ప్లాస్టిక్ వ్యర్ధాలు , చెత్త రోడ్డు మీద వేయకుండా పారిశుధ్య కార్మికులు ఇంటికి వచ్చినప్పుడు అందించాలన్నారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ,ఇందుకు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టామ మన్నారు. ఇందుకు స్వచ్ఛ సైనికులు ముందుకు రావాలన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు వివిధ వార్డుల్లో పర్యటిస్తున్నామన్నారు
కార్యదర్శి డా హసీంపేట్ మాట్లాడుతూ కాలవల్లో చెత్త వేయకుండా ఉంటే కాలవలు లోని మురుగునీరు సక్రమంగా పారుతుందన్నారు ఉపాధ్యక్షుడు సన్ స్టార్ స్కూల్ విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఉండే ప్రజలను పారిశుద్ధ్య కార్మికుల వచ్చినప్పుడు వారికి చెత్త అందించేందుకు అందించాలని చెబుతున్నా లన్నారు. ఈ కార్యక్రమంలో ఓంకార్ తో పాటు సన్ స్టార్ స్కూల్ అధ్యాపకులు పాల్గొన్నారు వైట్ బాక్స్ లో మొక్కలు పెంచే కార్యక్రమం చేపడతామన్నారు.