MachilipatnamLocal News
April 30, 2026
జిల్లా

డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం

  • April 30, 2026
  • 1 min read
[addtoany]
డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం

మొదటి దశ పనులు త్వరలో ప్రారంభం – ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం:

మచిలీపట్టణం నడిబొడ్డున స్థానిక జిల్లాకోర్టు సెంటరు నందు 2 ఎకరాల విస్తీర్ణంలో డా. భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ అనుమతుల జారీకి నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయమై బందరు ఎంపీ బాలశౌరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు మచిలీపట్టణం పార్లమెంట్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ భవన నిర్మాణానికి మొదటి దశ నిర్మాణానికి కావలిసిన రూ. 6.5 కోట్ల రూపాయలు గతంలోనే యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు మంజూరు అయిన సంగతి విదితమే. అయితే ఈ నిర్మాణానికి అవసరమైన స్థలమునకు సంబందించి ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతుల కొరకు ఇంతకాలం జాప్యం ఏర్పడింది. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనుమతులు కూడా మంజూరు కావడంతో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి బందరుకు తలమానికంగా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎంపీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *