జిల్లా గ్రంధాలయంలో వేసవి శిక్షణా తరగతులు
మచిలీపట్నం :
జిల్లా కేంద్ర గ్రంధాలయం నందు వేసవి శిక్షణా తరగతులలో భాగంగా గుడిపూడి రాధికా రాణి, మేడిశెట్టి యోగేశ్వరరావు, అప్పినీడు పోతరాజు ఫ్యాకల్టీలుగా కథలు రాయటంలో మెలకువలు, గేయ రచన, ప్రాస పదాలు, దస్తూరి అందంగా రాయటం, పజిల్స్ రూపకల్పన ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోవడం, పదజాల అభివృద్ధి శిక్షణ విద్యార్థినీ విద్యార్థులకు అందించారు. 90 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆహ్లాదకరమైన పండగ వాతావరణంలో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకట రమణ, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

