MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో కొల్లు ఫౌండేషన్ మజ్జిగ పంపిణీ – మండుటెండల్లో ప్రజలకు ఉపశమనం

  • April 23, 2026
  • 1 min read
మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో కొల్లు ఫౌండేషన్ మజ్జిగ పంపిణీ – మండుటెండల్లో ప్రజలకు ఉపశమనం
మచిలీపట్నం:
 
 మండుటెండలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ప్రజలకు చల్లని ఉపశమనం కల్పించేందుకు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన కోనేరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు మజ్జిగ సేవించి దాహార్తిని తీర్చుకున్నారు.
వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మండుటెండల్లో తాగునీరు, మజ్జిగ వంటి సేవలు ప్రజలకు ఎంతో అవసరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ వంటి శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు తీసుకోవడం, అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. కొల్లు ఫౌండేషన్ ఎల్లప్పుడూ ప్రజా సేవా కార్యక్రమాలకు ముందుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, గుమ్మడి విద్యాసాగర్, మెట్టు సూరిబాబు, మాజీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత, వేమూరి శ్రీదేవి, కరెడ్ల సుశీల, మహిళా నాయకులు పాలపర్తి పద్మజ, లంకిశెట్టి నీరజ, పద్మ తదితరులు పాల్గొని స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *