వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా డా రేణుకాదేవి
మచిలీపట్నం:
శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాల మచిలీపట్నం నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ రేణుక దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జి భానుమూర్తి , డిప్యూటీ సూపరింటెండెంట్స్ డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ భరత్ సింగ్ నాయక్ కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపల్ మాట్లాడుతూ తాను మెడికల్ కళాశాల క్యాంపస్ లోనే నివాసం ఉంటానన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. మెడికల్ కళాశాల పురోగతికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

