MachilipatnamLocal News
April 21, 2026
పోలీస్ & లీగల్ డైరీ

బాణసంచా పేలుడు గాయపడిన పోలీసులు క్షేమంగా డిస్చార్జ్..

  • April 20, 2026
  • 1 min read
[addtoany]
బాణసంచా పేలుడు గాయపడిన పోలీసులు క్షేమంగా డిస్చార్జ్..
మచిలీపట్నం :
 
బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బంది సురక్షితంగా కోలుకుని డిశ్చార్జ్ కావడం ఎంతో ఆనందదాయకమైన పరిణామం అని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అన్నారు. మార్చి 31వ తేదీన ప్రమాదవశాత్తు బాణసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన సిబ్బందిని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స అందుకుని సోమవారం క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న కోర్ట్ కానిస్టేబుల్ అబ్దుల్లా, కానిస్టేబుల్ నాగరాజు లను వారిని పరామర్శించేందుకు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రమాదం జరిగిన నాటినండి జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై సమాచారం తెలుసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు అందించవలసిన భరోసాను అందజేస్తూ వారికి సహాయకారిగా ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించారు. చికిత్స పొందుతున్న కాలంలో ప్రతి దశలోనూ జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా వారి ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ, వైద్యులతో నేరుగా మాట్లాడి ఉత్తమ చికిత్స అందేలా పర్యవేక్షించారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని పరామర్శించేందుకు రాష్ట్ర హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత విచ్చేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకుని ఇంకా మెరుగైన వైద్యం అందజేయాలని ,వారు క్షేమంగా తిరిగి వారి విధులకు చేరేలా చూడాలని సూచనలు చేశారు. అంతేకాక వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ,కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వెన్నంటే ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర , వాసంశెట్టి సుభాష్ , ఇతర ప్రజాప్రతినిధులు క్షతగాత్రులైన వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. ఏలూరు రేంజ్ ఐజిపి జి.వి.జి.అశోక్ కుమార్ క్షతగాత్రులైన వారిని కలిసి, వారికి వైద్య సదుపాయం ఏ విధంగా అందుతున్నది అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండమని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రాణాలకైనా తెగించి విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులే తమ కుటుంబమని, వారికి చిన్న ఇబ్బంది వచ్చినా జిల్లా పోలీస్ శాఖ అంతా ఒకటిగా నిలబడి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 
 
వైద్యుల కృషి, సిబ్బంది ధైర్యం, కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం కలిసి వారి ఆరోగ్యం మెరుగుపడటానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది పట్ల సమాజం చూపుతున్న ఆదరణ, మానవీయత ఎంతో ప్రేరణనిచ్చేదిగా ఉందన్నారు. సిబ్బంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నారు.
 
పోలీసు శాఖ ఒక కుటుంబం… ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి నిలబడతాం- అనే భావనను ఈ ఘటన మరోసారి స్పష్టంగా తెలిపారు. కష్టసమయంలో చూపిన ఐక్యత, మనస్ఫూర్తి, సేవా భావం, పరస్పర సహకారం—ఇవన్నీ కలిసి పోలీసు వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *