MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు

  • February 19, 2026
  • 0 min read
ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు
మచిలీపట్నం :
 
        ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలీనంపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
 
        మచిలీపట్నంలో జరిగిన కృష్ణా రివిజన్ మహాసభ సమావేశం కు కార్మికులు భారీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత కూడా ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. 
 
        ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం వెంటనే కల్పించాలని గతంలో ఉన్న వైద్య సౌకర్యాలను పునరుద్ధరించాలని, పలు సమస్యల ను పరిష్కరించేందుకు కార్మికులకు భరోసా కలిగించే విధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *