ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలు
మచిలీపట్నం:
స్థానిక ఈడేపల్లి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా భక్తి గీతాల కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో రేకపల్లి శ్రీనివాసు, జోగి శివశంకర్ ప్రసాద్, పుప్పాల కృష్ణారావు,గంజాల రవికుమార్, పి అన్నపూర్ణ,కోకా వసుంధర, జట్టి రమాదేవి,సర్వణి, శ్రీలక్ష్మి మొదలగువారు రకరకాల భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు,శ్రోతలు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

