వైభవంగా కేడీసీసీ బ్యాంక్ సీఈవో కుమార్తె వివాహ వేడుక
మచిలీపట్నం :
కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ సీఈవో అమృతలూరి శ్యామ్ మనోహర్ కుమార్తె శారిక వివాహం సాయి సుధీర్ తో నగరంలోని రెవిన్యూ కళ్యాణ మండపంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన వివాహానికి బంధువులు, స్నేహితులు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కే డి సి సి బ్యాంక్ సిబ్బంది హాజరయ్యారు. నూతన వధూవరులకు అతిథులు తమ శుభాశీస్సులు అందించగా, అతిధులకు శ్యామ్ మనోహర్ తన ఆత్మీయ ఆతిథ్యంతో మండప ప్రాంగణమంతా శోభాయమనంగా మారింది.

