డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడుగురికి డెబ్భై వేల జరిమానా
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు, మచిలీపట్నం డీఎస్పీ జి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆర్ పేట సీఐ, SI లు ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో, నిర్వహించిన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురిని గురువారం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజెస్టేట్ కోర్ట్ లో హాజరు పరచగా, న్యాయమూర్తి భూపతిన శ్రీనివాసు విచారణ చేసి ఒక్కొక్కరికి 10,000 వేల రూపాయలు చొప్పున ఏడుగురికి 70,000/- రూపాయలు జరిమానా విధించినట్లు ఆర్ పేట సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.

