దక్షిణ కాశీగా,ప్రముఖ శైవక్షేత్రంగా పిలువబడుతున్న వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు హీరోయిన్ పూనమ్ కౌర్.ఒకప్పటి స్టార్ హీరోయిన్ చాలా సింపుల్గా టెంపుల్కి రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కొందరు గుర్తు పట్టలేకపోయారు.
వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి ఈమధ్య కాలంలో సెలబ్రిటీల తాకిడి పెరిగింది. గతంలో రాజకీయ ప్రముఖులు మాత్రమే దర్శించుకున్న ఈ విశిష్ట ఆలయానికి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు సైతం దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఆ తర్వాత దక్షిణా భాషల్లో పలు సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్ వేములవాడలోని శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకప్పటి నటి. స్వామివారి కరుణ కటాక్షాలు టెక్స్టైల్ రంగంతోపాటు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.
భీమన్న సన్నిధికి టాలీవుడ్ తార..
ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. తాజాగా శ్రీ భీమేశ్వర స్వామివారిని టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పూనమ్ కౌర్ దర్శించుకున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయం అభివృద్ధి పనులు పూర్తికాగానే మళ్లీ స్వామివారి ఆశీస్సుల కోసం వస్తానన్నారు. శక్తి,ప్రపంచ శాంతి కోసం భారతదేశ మరింత శక్తివంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు హీరోయిన్ పూనమ్ కౌర్. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భీమేశ్వరస్వామివారి సన్నిధిలో శ్రీరాజరాజేశ్వర స్వామివారి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. హీరోయిన్ పూనమ్ కౌర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.