MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం టిడిపి కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

  • April 5, 2026
  • 0 min read
మచిలీపట్నం టిడిపి కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
మచిలీపట్నం :
 
మచిలీపట్నం టిడిపి కార్యాలయంలో డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జగ్జీవన్ రామ్ అని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నాయకులు పేర్కొన్నారు. మచిలీపట్నం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ మితభాషి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన మహానుభావుడని పేర్కొన్నారు. జమిందారీ కుటుంబానికి చెందిన ఆయన తన ఆస్తులను ప్రజల సేవలో వినియోగించారని, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని అన్నారు.
టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అపారమని, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలనే లక్ష్యంతో పనిచేశారని తెలిపారు. ఆయన చూపిన మార్గం నేటి రాజకీయ నాయకులు, యువత అనుసరించాల్సిన ఆదర్శమని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బురకా బాలాజీ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొడాలి మోషే, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చీలి సుమన్, రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం విజయ్, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు చిట్టూరి యువరాజు, చిన్నం శేఖర్, కొడాలి అంజిబాబు, నాగమ్మ, పాలపర్తి పద్మ, లంకిశెట్టి నీరజ తదితరులు మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు ఒక దారిదీపంలా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఎదుర్కొన్న అనేక సవాళ్లను ధైర్యంగా అధిగమించి, సమానత్వం కోసం సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ఇంకా వారు మాట్లాడుతూ, నేటి తరానికి ఆయన ఆలోచనలు మరింత అవసరమని, యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుని, సమానత్వం మరియు న్యాయం కోసం కట్టుబడి పని చేయాలని తెలిపారు. డా. బాబూ జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని స్పష్టం చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *