బుధవారం రెండవ భాష ఎస్ ఎస్ సి పరీక్షల సందర్భంగా కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నంలోని శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్, MPL గర్ల్స్ హై స్కూల్ పార్క్, KKR గౌతం హై స్కూల్, భాష్యం హై స్కూల్, సెయింట్ జాన్ హై స్కూల్, SR ప్రైమ్ హై స్కూల్, గవర్నమెంట్ రాంజీ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
మొత్తం 8 ఎస్ ఎస్ సి పరీక్షా కేంద్రాలను సందర్శించి, పరీక్షల నిర్వహణ విధానం మరియు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేసి అవసరమైన సూచనలు చేశారు. ఆన్ డ్యూటీలో ఉన్న ఏఎన్ఎం, పోలీస్ సిబ్బందితో చర్చించి, పరీక్ష కేంద్రాలలో భద్రతా ఏర్పాట్లు, మెడికల్ సదుపాయాలను పరిశీలించారు.