MachilipatnamLocal News
February 28, 2026
Uncategorized

అంధత్వాన్ని జయించి గ్రూప్ 2 విజయం

  • February 19, 2026
  • 1 min read
[addtoany]
అంధత్వాన్ని జయించి గ్రూప్ 2 విజయం
మచిలీపట్నం :
 
          అంధత్వాన్ని జయించి గ్రూప్ – 2 పరీక్షల్లో విజేతగా నిలిచి ఏపీపీఎస్సీ హెచ్ ఓ డి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు సాలిపేటకు చెందిన నందం నాగరాజును కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ బుధవారం సన్మానించారు.
 
           గ్రూప్ 2 విజేతగా నిలిచి ఉద్యోగం సాధించటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నాగరాజును అభినందించారు. కంటిచూపు కోల్పోయిన నాగరాజు విద్యాభ్యాసం ఎలా సాగించారో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, నాగరాజు తల్లి వెంటేశ్వరమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *