MachilipatnamLocal News
September 20, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు: విశ్వేశ్వరయ్య, చలమలశెట్టి సేవలకు ఘన నివాళి

  • September 16, 2026
  • 1 min read
మచిలీపట్నంలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు: విశ్వేశ్వరయ్య, చలమలశెట్టి సేవలకు ఘన నివాళి

మచిలీపట్నం:

మచిలీపట్నంలో మున్సిపల్, ముడా (MUDA) ఇంజనీర్లు మరియు ఎల్.టి.పి (L.T.P) ల ఉమ్మడి ఆధ్వర్యంలో మంగళవారం ఇంజనీర్స్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో మరియు మౌలిక వసతుల కల్పనలో విశ్వేశ్వరయ్య అందించిన అసమాన సేవలను, అలాగే ప్రముఖ ఇంజనీర్ చలమలశెట్టి నరసింహారావు కృషిని పలువురు వక్తలు కొనియాడారు. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు శ్రీపతి ఈశ్వర ప్రసాద్, వి.యస్.వి.యస్. గోపాల్, జి.వి. సుబ్బారావు, మురళీధర్ తో పాటు పలువురు ఇంజనీర్లు, మున్సిపల్, ముడా అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author

SSN