నగరంలోని కృష్ణా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నినాదం “టూగదర్ ఫర్ హెల్త్: స్టాండ్ విత్ సైన్స్” స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాంబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి. శాంతి కృప పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూత్రాలు & వ్యాధి నివారణ
– ఫార్మాకోలజీ & థెరపిటిక్స్
– క్లినికల్ ట్రయల్స్ & రీసెర్చ్
– మెడికల్ ఎథిక్స్ & పాలసీ
– వైద్య సాంకేతిక పరిజ్ఞానం & ఆరోగ్య సంరక్షణ
– మానసిక ఆరోగ్యం & సామాజిక ఆరోగ్యం విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించబడింది. ఈ కార్యక్రమం లో ఫార్మసీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హాజరుయ్యారు .