MachilipatnamLocal News
April 9, 2026
మచిలీపట్నం

పేర్ని కుటుంబంపై విమర్శలు చేస్తే సహించం – మాజీ కార్పొరేటర్ మేకల సుబ్బన్న

  • April 7, 2026
  • 0 min read
[addtoany]
పేర్ని కుటుంబంపై విమర్శలు చేస్తే సహించం – మాజీ కార్పొరేటర్ మేకల సుబ్బన్న
మచిలీపట్నం : 
 
మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) బందరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జ్ పేర్ని కిట్టులపై, పేర్ని కుటుంబం పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే వైసిపి కార్యకర్తలు ఎవ్వరు సహించరని మాజీ కార్పొరేటర్ మేకల సుబ్బన్న ఘాటుగా స్పందించారు. 
 
మేకల సుబ్బన్న మాట్లాడుతూ పేర్ని కృష్ణమూర్తి కుటుంబం పై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంగళవారం స్థానిక రామానాయుడుపేట వైయస్సార్సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన పేర్ని కుటుంబాన్ని విమర్శించే స్థాయి జనసేన నాయకులకు లేదన్నారు. తమతో బాటే ఉండి జనసేనలో చేరిన కొరియర్ శ్రీను ఇప్పుడు ఇష్టారాజ్యంగా పేర్ని నాని,కిట్టులను విమర్శించడం సహేతుకం కాదన్నారు. ఏ పార్టీ వారైనా, పరామర్శించడం పేర్ని కుటుంబ నైజం అన్నారు. కొబ్బరి తోటలో ఇల్లు కూల్చిన వారి ఇంటికి వెళ్లి పేర్ని నాని, కిట్టులు కుటుంబ సభ్యులను పరామర్శించడం తప్పా?అని ప్రశ్నించారు. 
 
సుబ్బన్న మాట్లాడుతూ పేర్ని కృష్ణమూర్తి కుటుంబానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, అలాంటి కుటుంబం పై అపవాదులు వేస్తే సహించం అన్నారు. తాను 20 సంవత్సరాలుగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానన్నారు. నగరంలో తాగడానికి నీరు దొరకదు కానీ, 34 పంచాయితీల్లో యదేచ్ఛగా 24 గంటలు మద్యం ఏరులై పారుతోందని దీనికి స్థానిక మంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంత్రి ఇలాకాలో మంచినీళ్లు దొరకవు కానీ,మద్యం, బెల్టు షాపులు విస్తారంగా దొరుకుతాయన్నారు. ఇది అబద్ధమైతే తాను కోనేరు సెంటర్లో ముక్కు నేలకు రాసి, తన ఆస్తులను ఎవరికి వ్రాయమంటే వాళ్ళకి రాసి బందరు వదిలి వెళ్ళిపోతానన్నారు. జనసేన పార్టీ జెండా కట్టే దమ్ముంటే వచ్చి పేర్ని నాని ఇంటి ముందు కట్టండి. అప్పుడు తాము ఏంటో చూపిస్తాం, అని సవాలు విసిరారు.
 
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు  పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *