డిగ్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షా కేంద్రాల ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ తనిఖీ చేశారు. మంగళవారం స్థానిక పద్మావతి మహిళా కళాశాల, ఆదిత్య డిగ్రీ కాలేజీ, వెంకటేశ్వరా డిగ్రీ కళాశాలలో పరీక్షల నిర్వహణా తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కె. రాంజీ కొన్ని సూచనలు చేశారు. ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.