MachilipatnamLocal News
April 9, 2026
మచిలీపట్నం

పూర్ణ వందేమాతరం గీతం ఆలాపన కార్యక్రమం

  • April 4, 2026
  • 0 min read
[addtoany]
పూర్ణ వందేమాతరం గీతం ఆలాపన కార్యక్రమం
మచిలీపట్నం :
 
      భారత జాతీయ గేయం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పూర్ణ వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని భారత్ వికాస్ పరిషత్, ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించారు. 
       స్థానిక ఇనుగుదురుపేట నాగార్జున పబ్లిక్ స్కూల్ నందు ఉదయం 8 గంటలకు భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ప్రసాద్ ప్రారంభ సందేశాన్ని ఇస్తూ 1870 సంవత్సరంలో బంకిమ్ చంద్ర ఛటర్జి బెంగాలీ, సంస్కృతంలో రచించిన భారత జాతీయ గీతం మొదటిగా ఆనంద్ మఠం నవలలో ప్రచురించబడినది. స్వాతంత్రోద్యమంలో దేశభక్తిని రగిలించింది. వందేమాతరం, జనవరి 24 1950వ సంవత్సరం భారత రాజ్యాంగ సభ దీనిని జాతీయగీతం గా ఆమోదించటం తెలిపిందని తెలియజేసినారు. 
         ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ స్కూలు అసోసియేషన్ మచిలీపట్నం డివిజన్ అధ్యక్షులు ఎం వెంకట నరసయ్య వందేమాతరం మీద నినాదాలు చేసినారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వి సుందర రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంతో విలువైనదని ప్రతి విద్యార్థికి పూర్ణ వందేమాతరం వచ్చే విధంగా కృషి చేయాలని ఈ గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంఘ సభ్యులను అభినందిస్తూ పూర్ణ వందేమాతర గీతాలాపన ప్రారంభించవలసిందిగా కోరారు. 
        చిన్నారి గాయని కుమారి కోమలి భ్రమరాంబిక పూర్ణ వందేమాతర గీతాన్ని ఆలపించగా విద్యార్థులందరూ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ఫైనాన్స్ సెక్రటరీ వివి రమణ, సంయుక్త కార్యదర్శి ఐ.వి.వి కుమార్, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు స్వామి, కార్యదర్శి కవిత, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆవోపా ఉపాధ్యక్షులు పులవర్తి శ్రీనివాస్, వివిధ విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *