MachilipatnamLocal News
April 3, 2026
Uncategorized

జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేసిన అధికారులు

  • April 1, 2026
  • 0 min read
[addtoany]
జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేసిన అధికారులు
జనసేన వర్సెస్ తెలుగుదేశం
తెర వెనుక చక్రం తెప్పిన తెలుగుదేశం పార్టీ 6 వ డివిజన్ ఇంచార్జ్
 
మచిలీపట్నం :
 
జనసేన కార్యకర్తపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్. కొబ్బరి తోటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటికి అనుమతులు లేవంటూ బుధవారం నగరపాలక సంస్థ అధికారులు కొంతమేర స్లాబ్ ను కూల్చివేశారు. తెలుగుదేశం పార్టీ 6 వ వార్డ్ ఇంచార్జ్ కక్ష సాధింపుల వల్ల ఇంటిని కూల్చి వేశారని బాధితులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటి యజమాని వద్దకు వచ్చి తనకు గజానికి 5000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు.
 
ఇంటి అక్రమ కూల్చివేతను ఆపాలని, ఇంచార్జ్ ఆగడాలను మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదని యజమాని వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంచార్జ్ కక్ష సాధింపుతోనే ఇంటిని కూల్చి వేస్తున్నారని వెంకటాచలం భార్య పెట్రోల్ తో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇంచార్జ్ వసూలు పర్వంను భరించలేమంటు బాధితులు తమ బాధను మీడియాకి వెళ్ళబుచ్చారు. నగరపాలక సంస్థ అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు అన్యాయంగా ఇల్లు కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
 
 ఇంటి కూల్చి వేతను ఆపాలని అధికారులను ప్రాధేయపడ్డ ఆపలేదన్నారు. ఇంటిని అక్రమంగా కూల్చివేయడం పై నిరాహారదీక్షకు దిగనున్న కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి తీరును జనసేన పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు దుయ్యబట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో పెద్ద ఎత్తున కొబ్బరి తోటకు చెందిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు . అయితే అక్రమ నిర్మాణం జరిగిందన్న ఆరోపణతో భవనం కొంతమేర స్లాబ్ ను నగరపాలక సంస్థ అధికారులు పోలీసు బలగాల సహాయంతో దగ్గరుండి మరి కూల్చివేశారు. ఈ కూల్చివేత ప్రక్రియ సాయంత్రం 5 గంటల నుండి 8:30 గంటల వరకు కొనసాగింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *