మచిలీపట్నం కెనడి రోడ్ లో ఉన్న భారతీయ జీవిత బీమా సంస్థ యందు ఆధునీకరణ ప్రాంతీయ కార్యాలయాన్ని బుధవారం జీవన ప్రకాశ బిల్డింగ్ నందు సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్, సౌత్ సెంట్రల్ జోన్ చీఫ్ ఇంజనీర్ ఎ హిలాలి, సీనియర్ డివిజన్ మేనేజర్ జి సుధాకర్ బాబు లచే ప్రారంభోత్సవం జరిగింది. మొదట వేద పండితులచే పూజా కార్యక్రమం అనంతరం జ్యోతి ప్రజ్వల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెంట్లు అంకితభావంతో పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేయాలని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ వెంకటరమణ (మేనేజర్ ఓ ఎస్ ), కె డి వి కృష్ణ (పి అండ్ ఐ ఆర్ ), పి విఠల్ బాబు(మార్కెటింగ్ మేనేజర్ )మరియు బ్రాంచ్ ఉద్యోగులు ఏజెంట్లు డివిజనల్ ఆఫీసర్లు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.