గురువారం కలెక్టరేట్లో ఛాంబర్ నందు దత్తత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న విశాఖపట్నం కి చెందిన గోపాల్ రఘు కుమార్, రాధిక మణి దంపతులకు కేంద్ర ప్రభుత్వ దత్తత అధీకృ త సంస్థ (కారా) అనుమతి లభించటంతో చిన్నా రిని దత్తత కు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. గన్నవరం మండలం బుద్ధవరం శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారి ని దత్తతు ఇచ్చారని తెలిపారు.
అనంతరం దత్తతు తీసుకున్న దంపతులని అభినందించి ఇకపై చిన్నారి సంరక్షణ బాధ్యత పూర్తిగా వారిపై ఉందన్నారు. ఈ కార్యక్రమం లో ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, నోడల్ అధికారి భానుమతి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.