మచిలీపట్నం :
కృష్ణా జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు యిర్రింకీ నాగ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో మచిలీపట్నం హిందూ కాలేజ్లో విద్యార్థినులతో కలిసి 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చర్యలపై ఘాటుగా నిరసన వ్యక్తం చేశారు. “మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే విధానాలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు యిర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు, జిల్లా ఇంచార్జ్ ప్రెసిడెంట్ కూనపరెడ్డి శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం గజేంద్ర, పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి లక్ష్మి నారాయణ, జిల్లా కార్యదర్శి ఘంటా సతీష్, జిల్లా యువ మోర్చా నాయకులు మదిరి కిరణ్, అవినాష్, ఆఫీస్ కార్యదర్శి వెంకటరమణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రసన్న కుమార్, వీబీ రాంజీ జిల్లా కన్వీనర్ నాగరాయలు, హరీ కృష్ణతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.