మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడి గ్రామంలో వైజేఆర్డీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విభాగం నిర్వహిస్తున్న ఏడు రోజుల ప్రత్యేక శిబిరంను విజయవంతంగా నిర్వహించారు . ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ శిబిరం ఫిబ్రవరి 15 న ముగుస్తోంది.
కళాశాల ఎన్ఎస్ఎస్ డా. అబ్దుల్ నబి ఆధ్వర్యంలో మొత్తం 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. శిబిరం తొలి రోజు గ్రామ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెండవ రోజు ‘స్వచ్ఛత’ కార్యక్రమం నిర్వహించి, స్వచ్ఛ భారత్ లక్ష్యంతో గ్రామ పరిసరాలను శుభ్రపరిచారు. మూడవ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యలపై గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించే విధంగా అధునాతన సర్వే నిర్వహించారు.
నాలుగవ రోజు ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానులపై మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఐదవ రోజు వేరుసెనగ పొలానికి వెళ్లి రైతులకు సహాయం చేయడంతో పాటు పంట కోత ప్రక్రియను తెలుసుకున్నారు. ఆ రోజునే నిర్వహించబోయే మెగా వైద్య శిబిరంను ,ఆరవ రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించగా ఎల్.వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ వైద్యులు నేత్ర పరీక్షలు నిర్వహించారు. కిషన్ డెంటల్ క్లినిక్ నిపుణులు దంత వైద్య సేవలు అందించారు. సత్య హాస్పిటల్స్ కు చెందిన ఆర్థోపెడిక్ నిపుణులు ఎముకల సంబంధిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు, కళ్లద్దాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన వచ్చింది. ఏడవ రోజు మంగినపూడి సముద్ర తీరంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించి చెత్తను తొలగిస్తూ శుభ్రతపై సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంతో శిబిరం ముగింపు దశకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రవి కుమార్ , వైస్ ప్రిన్సిపాల్ డా. బి. నాగ జ్యోతి , ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి డా. అబ్దుల్ నబీ,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు తదితరులు పాల్గొన్నారు.