MachilipatnamLocal News
April 9, 2026
Uncategorized

మచిలీపట్నం రూరల్ మండలంలో రెండో రోజు మంత్రి కొల్లు రవీంద్ర గ్రామ సందర్శన

  • April 9, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నం రూరల్ మండలంలో రెండో రోజు మంత్రి కొల్లు రవీంద్ర గ్రామ సందర్శన
సమస్యలు లేని నియోజకవర్గంగా మచిలీపట్నాన్ని మార్చడం నా లక్ష్యం
 
గ్రామ గ్రామానా సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కరించేలా చర్యలు
 
అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామ సందర్శన, ప్రజా దర్బార్
 
మచిలీపట్నం నియోజకవర్గం వాడపాలెం గ్రామ పంచాయతీలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర.
 
మచిలీపట్నం:
 
 ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కృషికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించినపుడే క్షేత్రస్థాయిలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మచిలీపట్నం నియోజకవర్గం వాడపాలెం గ్రామ పంచాయతీ వెంకటదుర్గాపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిథులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. రోడ్లపై డ్రైనేజీ పారడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. శానిటేషన్ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అదే సమయంలో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించేలా చూడాలన్నారు. అనంతరం అంగస్వాడీని పరిశీలించారు. ప్రభుత్వ స్కూల్లో మద్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. విద్యార్ధులకు మజ్జిగ పంపిణీ చేశారు.
 
 వాడపాలెం గ్రామంలో రూ.74 లక్షలతో రోడ్లు నిర్మించాం. నియోజకవర్గంలో రూ.30 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కొత్తగా పింఛన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రజల అవసరాలు తీర్చటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల మద్దతు ఇదేవిధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మున్సిపాలిటీలు అన్నింటా కూటమి విజయం సాధించాలి. 
 
  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తున్నాయి 2024 ఎన్నికల్లో 94 శాతం సీట్లతో విజయం సాధించాం. ఇది ప్రజా విజయం. ఇంతగా నమ్మిన ప్రజలకు మరింత మేలు చేయాలనే తపనతోనే రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పనిచేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలను సాకారం చేసి చూపించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4000 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేస్తున్నాం. 
 
 మరోవైపు అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి.. పరిశ్రమలను ఏపీకి రప్పిస్తున్నాం. గత ఐదేళ్లు ఏపీలో పెట్టుబడి పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంటే నేడు పారిశ్రామిక వేత్తలు నమ్మకంగా ఏపీకి వస్తున్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన పాలన ఉన్నపుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్రంలో మరో పాతికేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనే లక్ష్యంతో 27 పాలసీలు తీసుకొచ్చాం. గత ప్రభుత్వ హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు వెళ్లిపోగా, నేడు నమ్మకంతో ముందుకొస్తున్నారు. అందుకు నిదర్శనమే గూగుల్, అర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలు. ఈ మధ్యనే అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం. త్వరలోనే గూగుల్ సంస్థకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. 
 
 ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం అప్పులు, వడ్డీలకే సరిపోతోంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవాలి. అందుకే పరిశ్రమలు తీసుకొస్తున్నాం. పెట్టుబడులు రప్పిస్తున్నాం.
గతంలో మూడు రాజధానులు అన్నారు. తర్వాత అమరావతే రాజధాని అన్నాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఇలాంటి దుర్మార్గుల కారణంగా రాష్ట్రం దెబ్బతినకూడదనే లక్ష్యంతో అమరావతే రాజధాని అని ప్రకటించి తీర్మానం చేశాం. పార్లమెంటులో తీర్మానం చేస్తే దేశంలోని అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. కానీ జగన్ రెడ్డి మాత్రం మద్దతు ఇవ్వకపోగా పార్లమెంటు నుండి పారిపోయారు. గత ఐదేళ్లు అమరావతి రైతులు, మహిళలు చేసిన పోరాటం ఫలితంగానే ఇంత ఠీవీగా నిలబడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ , రూరల్ మండలాధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు , తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *