జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక ఆద్వర్యంలో ది.28-04-2026న జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యంలో పనిచేయుచున్న ఆరుగురు జూనియర్ అసిస్టెంట్ లకు సీనియర్ అసిస్టెంట్ లుగా, రికార్డు అసిస్టెంట్/ల్యాబ్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ లుగా పనిచేయుచున్న ఆరుగురు జూనియర్ అసిస్టెంట్ లుగా పదోన్నతి కల్పించినారు.
కారుణ్య నియామకం ద్వారా ఐదుగురు జూనియర్ అసిస్టెంట్ లుగా ఏడుగురు టైపిస్ట్ లుగా జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యంలోని వివిధ కార్యాలయముల నందు నియమించుచూ ఉత్తర్వులు జారీచేసియున్నారు.
వీరందరికి నియామక ఉత్తర్వులను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక చేతుల మీదగా అందచేయుట జరిగినది.
ఈ కార్యక్రమములో డా. జె. అరుణ , ముఖ్య కార్యనిర్వహణాధికారి, డా. ఆర్.సి. ఆనంద్ కుమార్ , ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి వార్లు మరియు ఎస్టాబ్లిష్మెంట్ పరిపాలనాదికారి & సిబ్బంది పాల్గోనియున్నారు.