MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా జిల్లా

ఎస్. టి. యు. సమర శంఖం పోస్టరు ఆవిష్కరణ

  • February 23, 2026
  • 0 min read
[addtoany]
ఎస్. టి. యు. సమర శంఖం పోస్టరు ఆవిష్కరణ
ఫిబ్రవరి 25 న చలో విజయవాడ
 
మచిలీపట్నం :
 
            కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ప్రధానమైన డిమాండ్ తో ఎస్టియు సమర శంఖం పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
               ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో ఉద్యోగులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఏ ఒక్కటి పూర్తి గా అమలు చేయలేదని, ప్రధానంగా 12వ పి.ఆర్.సి. నియామకం, 30% మధ్యంతర భృతి మంజూరు, సి.పి.ఎస్. విధానాన్ని రద్దు చేయాలని, ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి యం. మాధవరావు మాట్లాడుతూ రిటైర్ అయిన వారికి చెల్లింపులు సం.ల తరబడి పెండింగ్ లోనే ఉంటున్నాయని, రాష్ట్ర ముఖ్య మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.వసంతరావు మాట్లాడుతూ డి.ఎస్.సి. 2003 టీచర్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 25న ఎస్టియు సమర శంఖం పేరుతో విజయవాడలో మహా ధర్నా లో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ కె.సతీష్ బాబు మచిలీపట్నం అర్బన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిరణ్ బాబు, వీరబాబు మచిలీపట్నం మండల మండలం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వై.సుబ్రహ్మణ్యేశ్వర, రాజు గూడూరు మండలం అధ్యక్ష రాజేష్, పెడన మండల ప్రధాన కార్యదర్శి ఏమోజె మండలాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *