MachilipatnamLocal News
January 14, 2026
పోలీస్ డైరీ

కోడలిపై హత్యాయత్నం కేసులో మామ అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

  • January 9, 2026
  • 0 min read
[addtoany]
కోడలిపై హత్యాయత్నం కేసులో మామ అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
మచిలీపట్నం:
 
 మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన కోడలిపై హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలిపై కత్తితో దాడికి పాల్పడిన మామను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
 
ఘటన వివరాలు:
 
పరాసుపేటలోని అపోలో ఫార్మసీ సమీపంలో నివసించే ఆకూరి నాగ శ్వేత అనే మహిళపై 7న గత రోజు రాత్రి హత్యాయత్నం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
నిందితుడి అరెస్ట్:
 
పోలీసుల దర్యాప్తులో బాధితురాలి మామ అయిన కలిదిండి సోమరాజు (62) ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. కుటుంబ విభేదాల కారణంగానే తన కోడలిపై కత్తితో దాడి చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించారు. ఈ క్రమంలో, ఈ నెల 08న మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి (జి జి హెచ్) క్యాసువాలిటీ సమీపంలో మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
 
బాధితురాలి పరిస్థితి:
 
ప్రస్తుతం బాధితురాలు ఆకూరి నాగ శ్వేత మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, అసాంఘిక కార్యకలాపాలకు లేదా ఇటువంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిలకలపూడి సిఐ తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *