మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నగరంలోని వేడుక ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు ఆటలు, పాటలు, నృత్యాలతో సందడిగా గడిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ, కొనకళ్ల బుల్లయ్య కుమార్తె కొనకళ్ల శృతి, వేముల తపస్వి హాజరై కేక్ కటింగ్ చేసి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, మహిళా విభాగ నాయకులు పాలపర్తి పద్మజ, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు.