MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

ఈవీఎం గోదాము తనిఖీ

  • December 29, 2025
  • 0 min read
[addtoany]
ఈవీఎం గోదాము తనిఖీ
మచిలీపట్నం :
 
ఈవీఎం గోదాము వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు ఉండేవిధంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 
 
సోమవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిల్వఉంచిన గోదామును త్రైమాసిక తనిఖీలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరచి, అందులోని ఈవీఎం లను పరిశీలించారు. తనిఖీ పుస్తకంలో జిల్లా కలెక్టర్ తో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు.
గోదాములో ఉన్న సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా, విద్యుత్ సౌకర్యం సరిగా ఉందా లేదా అనే విషయమై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా కెమెరాలు గాని విద్యుత్ పరికరాలు గాని పనిచేయకపోతే వెంటనే మార్చాలన్నారు.
 
ఈ తనిఖీ లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు,, ఈవీఎం నోడల్ అధికారి నిత్యానందం, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, కార్యాలయ కార్యదర్శి దాసు, సిపిఎం, బిజెపి వైసిపి, బి ఎస్ పి పార్టీల ప్రతినిధులు సుబ్రమణ్యం, పంతం గజేంద్ర రావు, సిలార్ దాదా, బాలాజీ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి శ్యామ్ తదితర అధికారులు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *