MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • January 20, 2026
  • 1 min read
[addtoany]
జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
 
జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించేందుకు అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మత పెద్దలను కోరారు. 
 
మంగళవారం ఉదయం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు, మత పెద్దలతో సంయుక్త సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా 
జిల్లా పేద జిల్లా కానప్పటికీ ఇక్కడ కూడా బాల్య వివాహాలు జరగడం విచారకరమన్నారు. సాధారణంగా పెళ్ళిళ్ళు రిజిస్ట్రార్ కార్యాలయంలో గాని, గురువులు, మత పెద్దలవద్ద హిందూ, ఇస్లాం, క్రైస్తవ ఆచారాల ప్రకారం జరుగుతున్నాయన్నారు. 
బాల్యవివాహాలు చేసుకున్న వయోజనులను గాని ప్రోత్సహించిన వారిని గాని, పెళ్ళికి హాజరైన వారిని గాని ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదని చట్టరీత్యా అందరికి ఒకే శిక్ష పడుతుందన్నారు. ఆ శిక్షకు బెయిల్ ఉండదని, లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
ఈ శిక్ష నుండి మరే ఇతర వేదికలలో తప్పించుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
పెళ్లి జరిగే ముందు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం పరిశీలించాలన్నారు. 
 
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కే.వి. రామ కృష్ణయ్య మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 నుండి అమలులోకి వచ్చిందన్నారు. 
వివాహ వయస్సు అమ్మాయికి 18 సంవత్సరాలని, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలన్నారు. 
బాల్య వివాహాలు జరుగుతుంటే 1098 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలన్నారు
 
జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. చట్టం తెలియదని అంటే కుదరదని స్పష్టం చేశారు.
పెళ్లి జరిగే ముందే వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని గమనించాలన్నారు. బాల్య వివాహాలు జరిపితే బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దాక్షిణ్యంగా వారిపై కేసులు పెడతామని స్పష్టం చేశారు. మంచి ముహూర్తం అని సమయం దాటితే మళ్ళీ రాదని మంచి పెళ్ళికొడుకు అని భావించి బాల్యవివాహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని సూచించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం కింద 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు. బాల్య వివాహాలు జరుగుతుంటే ఆ సమాచారం పోలీసువారికి తెలియచేయాలన్నారు. చిన్నపిల్లలకు మానసిక పరిపక్వత ఉండదని గమనించి పెద్దలు పిల్లల భవిష్యత్తును పాడు చేయవద్దని, వారు చదువుకునేలా చేయాలని హితవు పలికారు.
అంతేకాకుండా ఫోక్సో చట్టం కూడా దీనికి అనుసంధానం చేస్తామన్నారు. గత 3, 4 నెలల కిందట కూడా బాల్య వివాహాలు జరిగి ఉంటే ఆ కేసులను కూడా పరిశీలించి బాధ్యులైన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
 
 
అనంతరం జిల్లా కలెక్టర్ బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల వలన కలిగే ఆరోగ్య సమస్యలను డిఎంహెచ్వో విపులంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని ఎం ఎం ఎన్ రాణి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, దేవాదాయ శాఖ ఏసి సాంబశివరావు డీఎస్పీ సిహెచ్ రాజా పలువురు హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు, ప్రజలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *