మచిలీపట్నం జగన్నాధపురం లోని వైష్ణవి కాలేజ్ నందు శుక్రవారం మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కృష్ణాజిల్లా ఏఈఎస్ భార్గవ్ కళాశాల విద్యార్థులకు మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్తుకు దగ్గరగా ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి జి గంగాధర్ రావు, మచిలీపట్నం ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది, సామాజిక కార్యకర్త కరెడ్ల సుశీల, వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ రామాంజనేయులు, మ్యాక్స్ హెచ్ఓడి మురళి, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.