జనవరి 27న నెల్లూరులోని ఎస్ వి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన 8 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలలో కృష్ణాజిల్లా జిల్లా గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అమీనా తబుసం 400 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించినందుకు గాను జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ అభినందించారు.
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని వైకల్యం దేనికి అడ్డు కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్, సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త కళ్ళేపల్లి ఏడుకొండలు, ఏ ఎల్ ఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఐఆర్పీలు హమీద్, రమాదేవి పాల్గొన్నారు.