మచిలీపట్నం :
మచిలీపట్నం బైపాస్ రోడ్డు లోని నారాయణపురం శివారు లో వేంచేసి ఉన్న అభయ కాళిక దేవి (పంతులు గారి దేవాలయం) నందు మంగళవారం ఉదయం పౌర్ణమి సందర్భముగా ఆలయ ప్రధాన అర్చకుడు బాబి, కొరపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 108 కలశాలతో హరిద్రం,పసుపు జలాల తో అమ్మవారికి అభిషేకం తదుపరి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అమ్మవారిని నిమ్మకాయల దండలతో అలంకరించి హారతులు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయినారు.