మచిలీపట్నం గాంధీనగర్ లో ఉన్న ఉదయపు నడక మిత్రమండలి భవనంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ, తండ్రి కృష్ణయ్య శెట్టి గురువారం ఆన్ లైన్ లో యోగా క్లాసులు ప్రారంభించారు.ఆసక్తిగల అభ్యాసకులు ఇంటి నుంచి గూగుల్ మీట్ లో యోగా క్లాసులు చేసే వారు ఇకనుంచి ఆన్ లైన్లో టివి చూస్తూ కుటుంబ సభ్యులు అందరూ యోగా చేసుకోవచ్చు.దీని వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అని వివరించారు.
ఈ సందర్భంగా యోగా గురువు గురునాథబాబు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్ డికె బాలాజీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆసక్తిగల అభ్యాసకులు ఈ లింకు పైన క్లిక్ చేసి https://meet.google.com/dck-sbwx-rdh
ఏపి యోగసభ వారి యోగా క్లాస్ లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గం. వరకు వామప్, సూర్య నమస్కారాలు, ధ్యానము, ప్రాణాయామాలు,ఆసనాలు నేర్పబడును. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందించుకోవలసిందిగా కోరారు.