గురువారం మచిలీపట్నం మినీ రేవతి థియేటర్ లో ఓం శాంతి సినిమా ప్రీమియర్ షో ను ప్రదర్శించారు. సినిమా కథానాయకుడుగా తరుణ్ భాస్కర్, కథానాయిక ఈషా రబ్బ నటించారు.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఓం శాంతి మూవీ ప్రీమియర్ షో ను ఉచితంగా ప్రేక్షకులకు ప్రదర్శించారు. ఈ సినిమాకి గాను ప్రేక్షకుల దగ్గర నుండి టికెట్లకు డబ్బులు వసూలు చేయలేదు. కుటుంబ తరహా చిత్రం ను వీక్షించి ప్రేక్షకులు ఆనందించారు. హీరో తరుణ్ భాస్కర్ గతంలో ఈ నగరానికి ఏమైంది, క్రీడా కోడ చిత్రాలలో నటించారు. ఇషా రబ్బ గతంలో రాజు గారి గది 2, అరవింద సమేత చిత్రాలలో నటించింది.