చిలకలపూడి నగరపాలక ఉన్నత పాఠశాల నందు మార్గద్రవ్యాలు ఉపయోగించడం వల్ల యువతకు కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ ఎవేర్నేస్ ప్రోగ్రాంలో భాగంగా “యుద్ధం మొదలైంది” అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సమాజం లో డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించడానికి పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వెంకటేశ్వరావు, ప్రధానోపాధ్యాయులు, సోషల్ వర్కర్ ఆకూరి శ్వేతా ఈగల్ టీమ్ సిబ్బంది, శక్తి టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.