క్రమశిక్షణ, పట్టుదలతో మంచి మార్కులు సాధించాలి….. జిల్లా కలెక్టరు డీకే బాలాజీ
SSN
- January 31, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం :
పదవ తరగతి విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధతో చదువుకొని పదో తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు.
శనివారం సాయంత్రం నగరంలోని పోలీస్ కళ్యాణమండపంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు.
అంతకు మునుపు జిల్లా కలెక్టర్ యధావిధిగా సైకిల్ పై కలెక్టర్ కార్యాలయం నుండి బయలుదేరి పోలీసు కళ్యాణ మండపానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధతో పదవ తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు.
తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ
తాను 9వ తరగతి వరకు చదివిన తీరు, ఆ తదుపరి పదవ తరగతి నుండి చదివిన తీరు వేరని అన్నారు. పదవ తరగతిలో చాలా పోటీ వాతావరణం ఉండేదని, తాను పదవ తరగతిలో చదివిన చదివే జీవితంలో ఎంతో ఉపయోగపడిందని, ఐఏఎస్ కాగలిగాననీ విశదీకరించారు.
చదువుకున్న సబ్జెక్టులను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉంటే సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చన్నారు.
అంతేకాకుండా పరీక్షలు వేగంగా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, మంచి కస్తూరి తో వ్రాయాలన్నారు. అప్పుడే మంచి మార్కులు పడతాయన్నారు.
ప్రస్తుతం మంచి బ్రాండ్లతో వెలుగొందుతున్న సంస్థలన్నీ ఒకప్పుడు వాటి యజమానులు అందరూ ఒకప్పుడు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే అని అన్నారు
ముఖ్యంగా సైకిల్ బ్రాండ్ నారాయణరావు, రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన తీరు విద్యార్థులకు వివరించారు.
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదట్లో ఎలా పట్టుదలగా ఆడేవారు ఎంతగా శ్రమించేవారు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలియచెప్పారు.
ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచనలు గొప్పగా ఉండాలని అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం అలవాట్లు మార్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
క్రమశిక్షణ, మంచి అలవాట్లు ఉంటే జీవితంలో ఏమైనా సాధించవచ్చని హితవు పలికారు.
విద్యార్థులందరూ చరవాణికి దూరంగా ఉండాలని, మెదడు బాగా పనిచేయాలంటే సరిగా ఆహారం తీసుకోవాలని రాత్రిపూట 7 నుంచి 8 గంటలు బాగా నిద్ర పోవాలని
అన్నారు.
అనంతరం నగరంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ పోటీలలో విజేతలైన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి యు వి సుబ్బారావు, ప్రైవేట్ పాఠశాలల సంఘాల అధ్యక్షులు కే వి జోన్, సన్ స్టార్ పాఠశాల అధినేత శ్రీరామ్, పలు ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, యాజమాన్య సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

