ఉద్యోగం నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక బుధవారం కారుణ్య నియామక పత్రాలను అందించారు. రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ గా, జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తర్వులు అందించారు.
వీరిలో ఆఫీస్ సబార్డినట్లు, జూనియర్ అసిస్టెంట్లుగా 19, టైపిస్టులుగా 19 మందికి నియామక పత్రాలు అందించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జిల్లా పరిషత్ మందిరంలో 48 మందికి కారుణ్య నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కన్నమ నాయుడు, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.