MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

ఘనంగా రంగాకు నివాళులర్పించిన వైసిపి నాయకులు

  • December 26, 2025
  • 0 min read
[addtoany]
ఘనంగా రంగాకు నివాళులర్పించిన వైసిపి నాయకులు
మచిలీపట్నం :
 
      వంగవీటి మోహన రంగా 37 వ వర్ధంతిని పురస్కరించుకొని మచిలీపట్నం రేవతి సెంటర్లో గల రంగా విగ్రహాన్ని శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మచిలీపట్నం వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు).
 
       ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పెద్ద ర్యాలీగా బయలుదేరి నగరంలో పలు ప్రాంతాలలో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 
 
      ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడమే రంగా లక్ష్యమని ఆయన సేవలను కొనియాడారు. విజయవాడ శాసనసభ సభ్యులుగా ప్రజాబలం కలిగిన ఏకైక నాయకుడు రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డిప్యూటీ మేయర్ శీలం భారతి, శీలం బాబ్జి, సిలార్ దాదా, చిటికెన నాగేశ్వరరావు, మేకల సుబ్బన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *