మచిలీపట్నం నగరం 50 డివిజన్లో శానిటేషన్ పనులను మెరుగుపరిచేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ బాపిరాజు నూతన చెత్త సేకరణ తోపుడుబండ్లను కొనుగోలు చేశారు. ఈ చెత్త సేకరణ తోపుడుబండ్లను, 850 డబ్బాలను గనుల ,భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన 76 తోపుడు బండ్లు విలువ అక్షరాల 19 లక్షల 80 వేలుగా, డబ్బాలు 9 లక్షల 50 వేల రూపాయలుగా తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత పై కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంసీ చైర్మన్ బండి రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుబియా ,తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు , కూటమి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.