సోమవారం కృష్ణా విశ్వవిద్యాలయం లో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు ప్రాంగణ ఎంపికల కార్యక్రమం చేపట్టారు. బిటెక్, బి ఫార్మసీ, ఎంబిఏ, ఎంసిఏ విద్యార్ధుల తోపాటు పిజి విద్యార్ధులు మూడు వందలమంది హాజరు కాగా నూట నలభై మంది ఎంపికయ్యారు.
మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సమన్వయం తో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్ లో ఎంపికైన వారికి ఉపకులపతి ఆచార్య కె. రాంజీ చేతుల మీదుగా నియామక పత్రాలు అందచేశారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ట్రైనింగ్, ప్లేస్మెంట్ సెల్ సమన్వయకర్త ఆచార్య వైకే సుందర కృష్ణ, డైరెక్టర్లు డా. కిషోర్, డా. హనుమంతరావు, డా. అలీ మీర్జా, కృష్ణ, విజయశేఖర్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.