కృష్ణా యూనివర్సిటీ పలు సంస్థల తో చేసుకుంటున్న అవగాహన ఒప్పందాల్లో భాగంగా మంగళవారం నాడు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ తో ఎం ఓ యూ కుదుర్చుకుంది.
ఒప్పందం లో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఐబీఎం సంస్థతో సమన్వయంగా రానున్న 11 నెలల కాలంలో కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలు, దాని అనుబంధ కళాశాలలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక టూల్స్ తో లైఫ్ అండ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే కొన్ని బహుళ జాతి సంస్థలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
ఈ అవగాహన ఒప్పందంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రాoజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, వర్సిటీ శిక్షణ, ఉపాధి అవకాశాల డైరెక్టర్ ఆచార్య వై కె సుందర కృష్ణ పాల్గొనగా మ్యాజిక్ బస్ సంస్థ నుండి డీజీఎం డి శేఖర్ బాబు, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సిహెచ్ మోహన్ సంస్థ ప్రతినిధులు శౌర్య, రత్న ప్రసాద్, పుష్పలత పాల్గొన్నారు.