రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్ రంజాన్ సందర్భంగా స్థానిక ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీదు నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, డిసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.