కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కోర్సుlu బి.పీ.డి (BPED) & డి.పీ.డి (DPED) – Hసెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు ఫిబ్రవరి 4, 2026 న
విడుదల చేయబడినట్లు కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి గౌరవనీయులు కూన రాంజీ మరియు పరీక్షల నియంత్రణాధికారి డా.పి.వీర బ్రహ్మచారి తెలియజేశారు.
పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు 11-02-2026 వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (www.kru.ac.in) లో పొందుపరిచినట్లు డా.పి. వీర బ్రహ్మచారి
తెలిపారు. సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చని వారు సూచించారు.