MachilipatnamLocal News
March 7, 2026
మచిలీపట్నం

బ్రాహ్మణులు అందరినీ కలుపుకుంటూ హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలి.

  • March 6, 2026
  • 1 min read
[addtoany]
బ్రాహ్మణులు అందరినీ కలుపుకుంటూ హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలి.
మచిలీపట్నం, 6,ఫిబ్రవరి 2026, SSN:
 
      సంకష్ట హర చతుర్థి సందర్భముగా సర్వేజనా సుఖినోభవంతు అంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంఘం వారు బుట్టాయిపేట శ్రీ చిట్టి పిళ్ళా రయ్య స్వామి వారి దేవాలయములో లోక సంక్షేమం కొరకు శుక్రవారం స్వామివారికి అభిషేకములు, అర్చనలు, శ్రీ లక్ష్మీ గణపతి హోమంలను బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్ దంపతులు శాస్త్రోత్తంగా నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సేవా సంఘం వారి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 
         ఈ సమావేశానికి హాజరైన ప్రముఖ వైద్యులు, బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకుడు, డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులు అందరినీ కలుపుకుంటూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి అని కోరారు.బ్రాహ్మణులు సమాజ సేవలో ముందు ఉంటూ, సమాజాభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయడం మన బాధ్యత అన్నారు.           బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ పిల్లలకు సంధ్యావందనం ఉచితంగా నేర్పించడం జరుగుతుందని, భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులపై ఎంతో ఉంది అన్నారు. హిందూ ధర్మం ఎంతో గొప్పదని అటువంటి ధర్మ పరిరక్షణలో మనం మనతోపాటు ఉన్నవారందరినీ కలుపుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలి అన్నారు. దేవాలయాలు మన సంస్కృతికి చిహ్నాలని, అటువంటి దేవాలయాలలో మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. 
        బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దేవాలయంలోనూ అర్చకుడితో పాటు, ఒక బ్రాహ్మణుడిని దేవాలయ కమిటీలలో నియమించడం జరిగిందని, ఆ కమిటీలలో ఉన్న బ్రాహ్మణులు దేవాలయాల అభివృద్ధికి చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయాల్లో వెల్లివిరిసేలా విశేష కృషి చేయాలి అని కోరారు. బ్రాహ్మణులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పెద్దల దృష్టికి ఆ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఫణి కుమార్ పలువురు బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు. 
        ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, మోపర్తిసుబ్రమణ్యం, కానుకొలను ఫణి కిరణ్ శర్మ, సింగరాజు గోవర్ధన్, వడ్లమన్నాటి మారుతి దివాకర్, జమ్మలమడక సేతురామయ్య, జొన్నలగడ్డ కాంత్, దిట్టకవి వెంకటేశ్వరరావు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నిమ్మగడ్డ శ్రీధర్, సర్వా లలిత కుమారి, జొన్నలగడ్డ మాధవి తదితరులతో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *