విద్యాహక్కు చట్టానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష టెట్ రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాఠశాలల విలీనాన్ని, మూసివేతలను ఆపాలని, నూతన విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ప్రధానమైన డిమాండ్లతో అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ టి యు కృష్ణా జిల్లా శాఖ తరపున పలువురు ఉపాధ్యాయులు ఈ ఆందోళన లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి ఇమ్మానియేల్ కృష్ణమూర్తి రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, ఆర్థిక కార్యదర్శి మాధవరావు తదితరులు ఈ ధర్నాలో పాల్గొని తమ నిరసన తెలిపారు.