కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బందరు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నున్న రాజు గారు నేషనల్ హైవే 216 పై వాహనదారులకు హెల్మెట్ ధరించడం పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత ట్రాఫిక్ నిబంధనలు, వాహనదారుల ప్రవర్తన నియమావళిని వివరించారు. అనంతరం ద్విచక్రవాహనం నడిపేటప్పుడు హెల్మెట్ల ప్రాముఖ్యత , వేగంగా బైక్ ను నడపడం ద్వారా జరిగే ప్రమాదాలు, ముగ్గురు బైక్ మీద కూర్చడం వలన జరిగే ప్రమాదాలు గురించి ద్విచక్ర వాహనదారులకు వివరించారు.